కనిగిరి: పట్టణంలోని కాశిరెడ్డి గిరిజన కాలనీలో సమస్యలతో సతమతమవుతున్న గిరిజనులు, పట్టించుకోని అధికారులు #localissue
కనిగిరి పట్టణంలోని శివారు ప్రాంతమైన కాశిరెడ్డి గిరిజన కాలనీలో గిరిజనులు సమస్యలతో సతమతమవుతున్నారు. శివారు నా కొండ ప్రాంతంలో కాలనీ ఉండడం వల్ల , చిల్ల చెట్లు విపరీతంగా పెరిగిపోయి పాములు సంచరిస్తున్నాయని, పిల్లలను బయటికి పంపాలంటేనే భయం భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు లేక ఫ్లోరైడ్ నీరు తాగి కాళ్ల నొప్పులతో బాధపడుతున్నామని, సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదని, ఓట్ల కోసం వచ్చినప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన నాయకులు ఆ తర్వాత ముఖం చాటేసారని బాధపడుతున్నారు. తమ సమస్యలను అధికారులు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.