సంతనూతలపాడు: నెల్లూరు నగర డివైఎఫ్ఐ నాయకుడు పెంచలయ్యను దారుణంగా హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో సోమవారం రాత్రి కొవ్వొత్తులతో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ... డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న పెంచలయ్యను దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశారన్నారు. పెంచలయ్యను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.