కనిగిరి: పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 543 కేసుల పరిష్కారం: జడ్జ్ రూప శ్రీ
కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 543 కేసులు పరిష్కారం అయినట్లు జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ తెలిపారు. క్రిమినల్ కేసులు 224, సివిల్ కేసులు 29, భరణం కేసులు2, STC కేసులు 287, PLC కేసు 1 పరిష్కారమైనట్లు జడ్జ్ తెలిపారు ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చి ఈ కేసులను పరిష్కరించినట్లు జడ్జి రూప శ్రీ అన్నారు.