రాప్తాడు: రాప్తాడు లో ప్రజల సమస్యలపై సిపిఐ నిర్వహించే ప్రచార జాతాను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్
అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆదివారం 11:30 గంటల సమయంలో ప్రజల సమస్యలపై సిపిఐ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే బోయే ప్రచార జాతను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ రాప్తాడు సిపిఐ సమితి ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పైన వ్యవసాయ సంక్షోభం రైతులకు గిట్టుబాటు ధర, ఉపాధి హామీ ,సాగునీరు,విద్య వైద్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆగస్టు ఒకటి నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రచార నిర్వహించి 17న కలెక్టరేట్ ముట్టడించబోతున్నామని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ పేర్కొన్నారు.