బ్రహ్మసముద్రం మండలం యనకల్లు కు చెందిన ఆనంద్ ది పరువు హత్య కాదని ఆత్మహత్యేనని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.రాజకీయ పార్టీ నాయకులు ఆనంద్ ది పరువు హత్యని ఆరోపించడం మంచిది కాదన్నారు. పంచనామాలో ఆత్మహత్య అని తెలిసిందన్నారు. పూర్వపరాలు తెలియకుండా, సాక్ష్యాలు లేకుండా పరువు హత్య అనడం మంచిది కాదన్నారు. ఎవరైనా ఆధారాలు అందజేస్తే విచారణ, దర్యాప్తు చేస్తామన్నారు. ప్రస్తుతం ఆత్మహత్య గాని కేసు నమోదు చేశామన్నారు.