కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామంలో శుక్రవారం కొల్లాపూర్ అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో వేదమంత్రోచరణల మధ్య ప్రతిష్టించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య హాజరయ్యారు. అనంతరం భక్తులతో కలిసి కొల్లాపూర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తలారి రంగయ్యకు తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా భక్తుల సందడే, కోలాహలం కనిపించింది.