దర్శి: కురిచేడు పట్టణం నందు బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు నిర్వహణ
కురిచేడు పట్టణం నందు ఆదివారం బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఆ పార్టీ జెండా ఆవిష్కరణ గావించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కురంగి నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.