దర్శి: కురిచేడు మండల కేంద్రంలో వైసిపి ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహణ
జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కురిచేడు మండల కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి కురిచేడు జడ్పిటిసి నాగిరెడ్డి మరియు వైసీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.