కనిగిరి: పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన యోగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యోగ పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన అవగాహన ర్యాలీని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో మున్సిపల్ అధికారులు యోగ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.... క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు యోగా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. యోగాతో దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గఫార్, కమిషనర్ జోసెఫ్ పాల్గొన్నారు.