కనిగిరి: ఎడవల్లి గ్రామంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, హాజరైన అధికారులు, భక్తులు
కనిగిరి మండలంలోని ఎడవల్లి గ్రామంలో ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు చేపట్టారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు పాల్గొన్నారు.