దర్శి: తాళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించిన దర్శి సీఐ రామారావు
Darsi, Prakasam | Apr 11, 2025 తాళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో శుక్రవారం దర్శి సీఐ రామారావు సమావేశం నిర్వహించారు. గుంటి గంగమ్మ తిరునాళ్ళను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లికార్జునరావు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.