అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని బూదిగుమ్మ క్షేత్రంలో శనివారం సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని భక్తజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు పల్లకి ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామి రథానికి రామసాగరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద దాతలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.