హనుమంతునిపాడు మండలంలోని వాలి చర్ల, నందనవనం సచివాలయాలను ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు గురువారం ఆకాశముకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం చేపడుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సిటిజన్ ఈ కేవైసీ, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను నూరు శాతం పూర్తిచేయాలని సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు.