దర్శి: నవధాన్యాల సాగుతోనే భూసారం పెంపుదల సాధ్యం: ముండ్లమూరులో ఏపీ డీఎంపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణ
Darsi, Prakasam | Apr 15, 2025 ముండ్లమూరు MEO ఆఫీస్ నందు ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయి సిబ్బంది 23 రకాల విత్తనాలు 30 క్వింటాలతో పీఎండీఎస్ కిట్లు తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి పకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు అధికారి సుభాషిని పాల్గొన్నారు. APDMP ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణ మాట్లాడుతూ.. వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు ఈ విధమైన విత్తనాలతో సాగు చేసి భూసారాన్ని పెంచాలని కోరారు. ఎండీ ఫరుక్, APM హనుమంతరావు పాల్గొన్నారు.