ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పెద్దవరం గ్రామంలో నూతన రామాలయం గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. అర్చకులు శేషాచారి వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో బిందెలతో నీటిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.