ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని గ్రామాలలో వైసీపీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వైసీపీ నాయకులను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో వైసీపీ మెజార్టీ కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసామన్నారు.