ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఎంతో కష్టపడుతున్నారన్నారు. అదే స్ఫూర్తితో తను కూడా తన దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.