ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొట్టి శ్రీరాములు డిగ్రీ కళాశాల నందు శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ పెద్దిరాజు తెలిపారు. టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా కార్యక్రమంలో 11 కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. సుమారు 500 మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.