కనిగిరి: ఎమ్మార్పీఎస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: మోట్రావులపాడులో MRPS నియోజకవర్గ కన్వీనర్ రాజు మాదిగ
పామూరు: ఎమ్మార్పీఎస్ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ జేపీ రాజు మాదిగ అన్నారు. పామూరు మండలం మోట్రావులపాడులో స్థానిక ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలతో రాజు మాదిగ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మండ కృష్ణ మాదిగ ఆదేశాలమేరకు కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగిరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.