కనిగిరి: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
పామూరు పట్టణంలోని నర్ర మారెళ్ళ గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూని ఫామ్స్, బ్యాగులు, బూట్లను శనివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.