తాడిపత్రి: కిష్టిపాడు సమీపంలోని 63 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, బైకర్ కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో జగన్నాథ్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుత్తికి చెందిన జగన్నాథ్ రెడ్డి రాయలచెరువు వెళ్లి బైక్ లో తిరిగి గుత్తికి వెళుతుండగా ఎదురుగా ఆటో వచ్చి ఢీకొనింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగన్నాథ్ రెడ్డి గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.