యాడికి లో త్వరలో మార్క్ఫెడ్ ద్వారా పప్పు సెనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని యాడికి మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పప్పు సెనగ క్వింటమ్ రూ.5,875 మద్దతు ధర ప్రకటించినదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే పప్పు సెనగ కొనుగోలు చేస్తామన్నారు.