ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో సుమారు నాలుగు కోట్లకు పైగా అంచనా వ్యయంతో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదని ఇంటి పన్ను, నీటి పన్నుతో మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అందుకోసమే సోలార్ ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు. సోలార్ ప్లాంట్ పూర్తయితే తాడిపత్రి గ్రీన్ సిటీగా తయారవుతుందన్నారు. రాష్ట్రమంతా తాడిపత్రి వైపు చూస్తారన్నారు. అందరూ పనులు చెల్లించాలని కోరారు.