ధూప, దీప, నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అర్చకుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సోమవారం కాచిగూడ చౌరస్తా నుంచి అబిడ్స్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ. 35 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.