ఉరవకొండ: శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ శ్రీ మారెమ్మ దేవమ్మ అమ్మవారు
ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో కొలువైన శ్రీ మారెమ్మ దేవమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ కార్యక్రమాన్ని సేవా కమిటీ సభ్యులు నిర్వహించారు.