కనిగిరి: పట్టణంలో జీవో నెంబర్ 396 ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పెన్ డౌన్ చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లకు మద్దతు తెలిపిన సిపిఐ
కనిగిరి పట్టణంలో డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 ను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమానికి శుక్రవారం సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మార్కాపురం జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డాక్యుమెంట్ రైటర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రవీంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో లక్షలాదిమంది పొట్ట కొట్టేలా ప్రభుత్వం తీసుకువచ్చిన 396 జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలన్నారు.