గిద్దలూరు: కొమరోలు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని తిరుమలనాథ స్వామి తిరుణాల సందర్భంగా ఆసక్తిగా సాగిన గుండు పందెం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలోని తిరుమలనాథ స్వామి ఆలయ తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన గుండు పందెం అందర్నీ విశేషంగా ఆకర్షించింది. పలువురు యువకులు ఈ పోటీలలో పాల్గొని తమ సత్యాన్ని చాటారు. ఓ యువకుడు 50 కేజీల గుండును ఐదుసార్లు ఎత్తడం విశేషం. ఈ పోటీలలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.