అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం రమనేపల్లి గుండ్లపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనంలో వెళుతూ వెలుగు కార్యాలయ సిసి గా విధులు నిర్వహించే మంజునాథ కుక్క అడ్డు రావడంతో గురువారం రాత్రి 7:00 గంటలకు ద్విచక్ర వాహనం నుండి కిందపడి గాయాల పాలయ్యాడు. హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గాయపడిన సిసి మంజునాథను వెలుగు ఏపీఎం సురేఖ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.