రాప్తాడు: న్యా మద్దెల గ్రామం వద్ద చలో న్యామద్దెల నిరసన కార్యక్రమం సభ ఏర్పాట్లను పరిశీలించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం న్యామద్దెల గ్రామం వద్ద ఆదివారం నాలుగు గంటల 20 నిమిషాల సమయం లో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈనెల 31న నిర్వహించబోయే నిరసన కార్యక్రమం సభ ఏర్పాట్లను వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నీతి హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధం కాబోతున్నామని అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పరిశీలించడం జరిగిందని ఈనెల 30న నిర్వహించే ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు రైతులు పాల్గొని విజయంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.