షాద్నగర్ లో బస్సులు ఆపాలంటూ వినతిపత్రాన్ని అందజేశారు.రాత్రి 9 గంటలు దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి షాద్నగర్కు రావడానికి ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని షాద్నగర్ పట్టణవాసులు తెలిపారు. షాద్నగర్ పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డులో బస్సులను ఆపాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజినల్ మేనేజర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గణేశ్నగర్ సేవాసమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.