గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని సంజీవరెడ్డి నగర్ లో ఇళ్లల్లోకి వస్తున్న మురుగునీరుతో స్థానిక ప్రజలు ఆగ్రహం
గిద్దలూరు 20వ వార్డులోని సంజీవరెడ్డి నగర్ లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నీరంతా ఇళ్లల్లోకి వస్తుండడంతో శుక్రవారం స్థానికులు అధికారులపై మరియు ప్రజాప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. కొద్దిగా రోజులుగా అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు చెబుతున్న పట్టించుకోవడంలేదని దీంతో ఇళ్లల్లోకి వస్తున్న మురుగునీరుతో అవస్థలు పడుతున్నామన్నారు. ఈగలు దోమలు పెరిగిపోయి అనారోగ్యం బారిన పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.