నాగులప్పలపాడు మండలంలోని చదలవాడ లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని డిఆర్ఓ ఓబులేసు, తహసిల్దార్ ప్రవీణ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు అందించే పౌష్టికాహార వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల హాజరు శాతాన్ని పెంచాలని సిడిపిఓ ఇవాంజెలిన్ ను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు అందించాలని డిఆర్ఓ ఓబులేసు ,తహసిల్దార్ ప్రవీణ్ సూచించారు.