కనేకల్లు మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఆదినారాయణ బీర తోటను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు సందర్శించారు. బుధవారం సాయంత్రం మండల టిడిపి అధ్యక్షులు వన్నారెడ్డి, వాల్మీకి నేత సుదర్శన్, పలువురు టిడిపి నేతలతో కలిసి బీర తోటను పరిశీలించి రైతుతో మాట్లాడారు. పంట సాగు, సస్యరక్షణ, దిగుబడి, మార్కెటింగ్, ప్రభుత్వ ప్రోత్సాహం తదతర విషయాలు అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పంట పండించే రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని తెలిపారు.