నీరు తాగేందుకు వచ్చి బురదలో కూరుకుపోయి చిరుత మృతి చెందినట్లు జిల్లా ఫారెస్టు అధికారి చక్రపాణి మీడియాకు తెలిపారు. రాయదుర్గం కొండలో నీటి కొలనులో మృతి చెందిన చిరుత కళేబరానికి శుక్రవారం మద్యాహ్నం పశువైద్యులతో పోస్టుమార్టం పూర్తి చేయించారు. అవయవాలు అన్నీ సక్రమంగానే ఉన్నాయన్నారు. శరీర బాగాలను ఫోరెన్సిక్ కు పంపుతున్నట్లు వెల్లడించారు. ఏ కారణంతో మృతి చెందిందో పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందన్నారు.