డి.హిరేహాల్ మండలంలోని నాగలాపురం - చెర్లోపల్లి సమీపంలో ఉన్న నాగలింగేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేలాది మంది భక్త జన సందోహం మధ్య ఉత్సవ మూర్తిని రథంపై కొలువుదీర్చి బ్రహ్మ రథోత్సవం నిర్వహించారు. ఆంద్ర కర్నాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.