రాయదుర్గం పట్టణంలోని కొండపై ఏనుగుల బావిలో చిరుత మృతి ఘటనపై జిల్లా ఫారెస్టు అధికారి చక్రపాణి విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం కొండపైకి చిరుత మృతి ఘటన సమాచారం అందుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుత మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టు మార్టం నిమిత్తం బొందనకల్లు ఫారెస్టు ఏరియాకు తరలించారు. ఆయన వెంట రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డి పశువైద్యులు, , రెవెన్యూ అధికారులు ఉన్నారు.