రాయదుర్గం పట్టణంలోని కొండపై ఏనుగుల బావిలో చిరుత మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్లిన కొందరు చిరుత బావిలో పడిఉండటాన్ని గమనించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా చంపి పడేశారా లేక ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిందా అనే విషయం తెలియాల్సి ఉంది.