దర్శి: దర్శిలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ప్రారంభించిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి
దర్శిలో నగర పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన చలివేంద్రాలను దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వ్యక్తం చేశారు. దర్శి పట్టణంలో ప్రధాన కూడళ్లలో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య మరియు మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావులు పాల్గొన్నారు.