కొండపి: తాళ్లూరు మండలం విఠలాపురంలో భూదేవి ఆలయం వద్ద ఓ వ్యక్తి సజీవ సమాధి.. వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆదివారం తెల్లవారుజామున భూదేవి ఆలయం వద్ద ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు సమాధిలోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని బయటకు తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.