కొండపి: టంగుటూరు మండల కేంద్రంలో పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించాలని శుక్రవారం టంగుటూరు బొమ్మల సెంటర్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పారన్నారు. ఇప్పుడు కూటమి నాయకులు అధికారం రాగానే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచటం దుర్మార్గమన్నారు.