రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో ఉపకులపతి జ్యోతి కుమార్ కు వినతి పత్రం ఇచ్చిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో శ్రీకృష్ణ ధరల విశ్వవిద్యాలయంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమా మహేష్ ఆధ్వర్యంలో ఉపకులపతి జ్యోతి కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమామహేష్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ మాజీ ఉపకులపతి రామకృష్ణారెడ్డి సొంత పనుల కోసం యూనివర్సిటీ చెందిన ఏడు లక్షల రూపాయల నిధులు సొంత పనుల కోసం వినియోగించుకోవడం జరిగిందని ఇప్పటికైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని యూనివర్సిటీ డబ్బులు తిరిగి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కిరణ్ ఉమా మహేష్ డిమాండ్ చేశారు.