కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డులో మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ సచివాలయ మరియు టిడిపి నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడితో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని,, నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను స్థానికులు కోరారు. వేసవిలో నీటి అద్దె తలెత్తకుండా మున్సిపాలిటీలో చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. అదేవిధంగా వార్డులో విద్యుత్ మరియు డ్రైనేజీ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.