దర్శి: దర్శి మండలం లంకోజనపల్లిలో కోదండ రామస్వామి తిరునాళ్లలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జ్ లక్ష్మి
దర్శి మండలం లంకోజనపల్లిలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి కోదండ రామస్వామి వారి తిరుణాల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. తొలుత ఆమె ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి గ్రామస్థులు శాలువాతో ఆమెను సన్మానించారు.