యాడికి మండల కేంద్రానికి చెందిన నందిని అనే యువతి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు యాడికి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నందిని నవంబర్ 29న ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూల్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.