సంతనూతలపాడు: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మద్దిపాడు, సంతనూతలపాడులో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు
సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు, సంతనూతలపాడు లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిపాడు లో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి, సంతనూతలపాడు లో ఐసిడిఎస్ సూపర్వైజర్ అనురాధ తల్లులు మరియు అంగన్వాడి కార్యకర్తలతో కలిసి అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవి అన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లులు బిడ్డలకు ముర్రుపాలు తాపించాలని , అలా చేయడంవల్ల బిడ్డల్లో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుందన్నారు.