ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ప్రజలు మద్యం తాగకుండా వాహనాలు నడిపి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలని విజ్ఞప్తి చేశారు.