ఉరవకొండ: మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్*
అనంతపురం నగరంలోని
అనంతపురం నగరంలోని రామ్నగర్లో ఉరవకొండ శాసన సభ్యులు,రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని మంత్రివర్యులు స్వయంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.