ఖైరతాబాద్: కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం: బంజారాహిల్స్ లో సిపి సజ్జనార్
కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. బంజారాహిల్స్లో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేసుల నమోదు దర్యాప్తు, తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి FIR నమోదు చేయాలని స్పష్టం చేశారు.