ఉరవకొండ: గడేకల్ నందు వైభవంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవం. తరలివచ్చిన భక్తజనంతో జనసంద్రంగా మారిన గడేకల్
అనంతపురం జిల్లా విడపనకల్ మండల పరిధిలోని గడేకల్ గ్రామంలో వైభవంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కొనసాగింది. మహా రథోత్సవం సందర్భంగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు. భీమలింగేశ్వర స్వామి మహా రథోత్సవ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తజనం తరలివచ్చి తిలకించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనంతో గడేకల్ గ్రామం భక్తజనసంద్రంగా మారింది.