ఉరవకొండ: హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల్లోమంత్రి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే విశ్వ పై టీడీపీ విమర్శలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో వైసీపీ మండల అధ్యక్షుడు మచ్చన్న, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షలు శివలింగప్పలు బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కూడేరు మండలం చోళ సముద్రం గ్రామంలో హంద్రీనీవా కాలువ పనుల అవినీతిని బహిర్గతం చేయడానికి ఉరవకొండ నియోజకవర్గం ఇన్చార్జ్ వైవిశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజల నుండి రైతుల నుండి విశేష స్పందన రావడంతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, బెలుగుప్ప మండల టీడీపీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియక విశ్వపై విమర్శిస్తున్నారు.